భారత్కు చెందిన విద్యార్థులు, యాత్రికులు, ఇతరులు వేల సంఖ్యలో ఇతర దేశాల్లో చిక్కుకుపోయారు. వీరిని వెనక్కి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాయు, జల మార్గాల ద్వారా వీరిని తరలించేందుకు చర్యలు చేపట్టింది.
దాదాపు 1 లక్ష 90 వేల మంది భారతీయులు తిరిగి వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి పెట్టుకున్నారు. వీరి తరలింపునకు చర్యలు చేపట్టిన ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాల్లో తీసుకువస్తున్న నేపథ్యంలో యూరోప్ దేశాల నుంచి తీసుకువచ్చే వారి వద్ద నుంచి రూ. 50 వేలు, యూఎస్ నుంచి తీసుకువచ్చే వారి వద్ద నుంచి రూ. లక్ష వసూలు చేస్తుంది. పశ్చిమ ఆసియా, మాల్దీవుల్లో చిక్కుకున్న వారిని జలమార్గాల్లో తరలించనున్నారు. గల్ఫ్ వార్ త్వరాత ఎయిర్ ఇండియా ఇంత పెద్దఎత్తున కార్యక్రమం చేపట్టడం ఇదే తొలిసారి.
ఇతర దేశాల్లో చిక్కుకున్న వారిని వెనక్కి తీసుకువచ్చేందుకు ఈ నెల 7 నుంచి 13వ తేదీ వరకు మొత్తం 13 దేశాల నుంచి 64 విమానాల ద్వారా 14,800 మందిని తొలివారంలో తరలించనున్నట్లు పౌర విమానయానశాఖ మంత్రి హర్థీప్పూరీ తెలిపింది. ప్రయాణికులందరిని స్క్రీనింగ్ చేసిన తర్వాతే విమానాల్లోకి అనుమతించనున్నట్లు తెలిపింది. భారత్కు వచ్చిన తర్వాత క్వారంటైన్కు పంపనున్నట్లు వెల్లడించింది.
SOURCE: నమస్తే తెలంగాణ, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ది హిందూ, టీఓఐ